ప్రకృతి విపత్తును.. రాజకీయం చేయొద్దు : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ప్రకృతి విపత్తును.. రాజకీయం చేయొద్దు : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

వయనాడ్ దుర్ఘటనకు రాహుల్ గాంధీ కారణం అన్నట్లు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.  ప్రకృతి విపత్తును రాజకీయం చేయొద్దని హితవు పలికారు.

గడిచిన 10 ఏళ్ల బీజేపీ హయాంలో ఎన్నో రైలు ప్రమాదాలు జరిగి వందల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు ఎంపీ  వంశీకృష్ణ.  ఆ ప్రమాదాలకు బాధ్యత వహించి ఎవరు రాజీనామా చేస్తారో బీజేపీ అధిష్టానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల భద్రత కోసం ఏటా రైల్వేశాఖ 20 వేల కోట్లు ఖర్చు చేస్తుంది.. కానీ ఆ 20 వేల కోట్లు ఎటుపోతున్నాయో సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు వంశీకృష్ణ. రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ,  కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ లు రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు  వంశీకృష్ణ.