రవీంద్రఖనిలో అజ్ని ఎక్స్​ప్రెస్​ రైలు హాల్టింగ్​కు కృషి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రవీంద్రఖనిలో అజ్ని ఎక్స్​ప్రెస్​ రైలు హాల్టింగ్​కు కృషి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కోల్ బెల్ట్/గోదావరిఖని, వెలుగు:  కాజీపేట టు బల్లార్షా అజ్నీ ఎక్స్​ప్రెస్​ రైలు పునరుద్ధరణతో పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కలుగుతాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్​ ప్రాంతాల్లో ఎంపీ పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మంచిర్యాల జిల్లా రవీంద్రఖని(రామకృష్ణాపూర్​) రైల్వే స్టేషన్​లో అజ్ని ఎక్స్​ప్రెస్​కు హాల్టింగ్​ ఉండేదని, మళ్లీ  హాల్టింగ్​ను పునరుద్దరించేందుకు తన వంతు కృషి చేస్తానని స్థానికులకు భరోసా ఇచ్చారు. అంతకు ముందు రవీంద్రఖని రైల్వే స్టేషన్​లో అజ్ని ఎక్స్​ప్రెస్​ రైలుకు హాల్టింగ్​ కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ టౌన్​ ప్రెసిడెంట్​ పల్లె రాజు ఆధ్వర్యంలో లీడర్లు ఎంపీకి వినతిపత్రం అందజేశారు.

నేషనల్​ హైవే 363 ఫోర్​లేన్​ రహదారిని దాటేందుకు బొక్కలగుట్ట బస్​స్టేజ్​ వద్ద డివైడర్ లేదా అండర్​ పాస్​ ను ఏర్పాటు చేయాలని ఎంపీకి బొక్కలగుట్ట గ్రామస్తులు, యువకులు వినతిపత్రం అందజేయగా.. హైవే ఆఫీసర్లతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.  మందమర్రి బస్టాండ్​లోకి బస్సుల రాకపోకలు, హైదరాబాద్​కు సర్వీసుల పెంచాలని మంచిర్యాల డిపో మేనేజర్​జనార్దన్​ తో ఫోన్​లో ఎంపీ మాట్లాడారు. 

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ..

మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఎంపీ వంశీకృష్ణ  పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనారోగ్యం బారిన పడి ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన మందమర్రి  బ్లాక్ కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ గోపతి రాజయ్యను ఎంపీ పరామర్శించి ఆరోగ్యం పరిస్థితులను ఆడిగి తెలుసుకున్నారు.