రామగుండంలో ఎయిర్​పోర్టు ఎంతో అవసరం : ఎంపీ వంశీకృష్ణ

రామగుండంలో ఎయిర్​పోర్టు ఎంతో అవసరం : ఎంపీ వంశీకృష్ణ

రామగుండం ప్రాంతంలో ఎయిర్​పోర్టు అవ సరం ఎంతో ఉంది. ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్​సీఎల్, జైపూర్​ఎస్టీపీపీ, బసంత్​నగర్​సిమెంట్​ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆయా పరిశ్రమల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు చాలా మంది పని చేస్తున్నారు.   ఈ ప్రాంతం నుంచి విదేశాలకు కూడా ఎక్కువ మంది జాబ్ లు, స్టడీస్  కోసం వెళ్తుంటారు. 

పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్​ వంటి పట్టణాల నుంచి  విమాన సర్వీసుల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్​కు వెళ్తుంటారు. రామగుండంలో ఎయిర్​పోర్టు ఉంటే ఆయా ప్రాంతాలవారికి సమయం ఆదాతో పాటుప్రయాణం ఈజీ అవుతుంది. రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉండడంతో సమీప రాష్ట్రాలకు వెళ్లే వారికి కూడా ఎయిర్​ పోర్టు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. రామగుండంలో ఎయిర్​ పోర్టు ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​నాయుడుకు లేఖ అందజేసి వివరించాను. స్పందించిన కేంద్ర మంత్రి ఆదేశాలతో బసంత్​నగర్, అంతర్గాంలో భూముల రీ సర్వే చేపట్టింది. త్వరగా ఎయిర్​పోర్టుకు అనుమతి ఇచ్చే లా మరోమారు కేంద్ర మంత్రిని కలిసి కోరు తాను. 

-  గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి ఎంపీ