గణనాథుడి ఆశీర్వాదంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం: MP వంశీకృష్ణ

గణనాథుడి ఆశీర్వాదంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం: MP వంశీకృష్ణ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  అన్నారు. సోమవారం (సెప్టెంబర్ 16) గోదావరిఖనిలో నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‎తో కలిసి  ఎంపీ వంశీ కృష్ణ పాల్గొన్నారు. పలు వినాయక మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీ మాట్లాడుతూ.. ఏ మంచి పని మొదలు పెట్టిన మొదటగా మొక్కేది గణపతి దేవుడినే.. గణనాథుడి ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్టాన్ని అప్పులపాలు చేసిన కూడా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజా పాలన అందిస్తుందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ఈ సందర్భంగా వంశీకృష్ణ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.