
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి కాంగ్రెస్ లీడర్లు హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో గురువారం కలిశారు. ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచిన వంశీకృష్ణకు అభినందనలు తెలిపారు. అనంతరం శాలువా, బొకేతో సన్మానించారు. కార్యక్రమంలో బాలసాని సతీశ్ గౌడ్, వెంకన్న, గాజుల అరుణ్ కుమార్, బాలసాని రమేశ్ ఉన్నారు.