గుమ్మడిదలలో 12 రోజుకు చేరిన నిరసన

గుమ్మడిదలలో 12 రోజుకు చేరిన నిరసన
  • డంప్​యార్డు ముట్టడి ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు 

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని ప్యారానగర్​లో ఏర్పాటు చేస్తున్న డంప్​ యార్డుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ఆదివారం 12 రోజుకు చేరుకున్నాయి. గుమ్మడిదలలో అంబేడ్కర్​ చౌరస్తా వద్ద చేపట్టిన రిలే దీక్షలో అంబేడ్కర్​యువజన సంఘం పాల్గొని మద్దతు తెలిపింది. గుమ్మడిదల నుంచి అన్నారం వరకు బైక్​ ర్యాలీ నిర్వహించారు. చలో డంప్​ యార్డు అంటూ మహిళలు, యువకులు ముట్టడికి యత్నించారు.  దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.