తైక్వాండో, కబడ్డీ టోర్నమెంట్లలో అంబేద్కర్​ ఇనిస్టిట్యూషన్స్ స్టూడెంట్ల సత్తా

తైక్వాండో, కబడ్డీ టోర్నమెంట్లలో అంబేద్కర్​ ఇనిస్టిట్యూషన్స్ స్టూడెంట్ల సత్తా
  • అభినందించిన కరస్పాండెంట్ డాక్టర్​ సరోజా వివేక్

ముషీరాబాద్, వెలుగు : బాగ్​లింగంపల్లిలోని కాకా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్​స్టూడెంట్లు చదువుతోపాటు ఆటల్లో రాణిస్తున్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన తైక్వాండో, కబడ్డీ టోర్నమెంట్లలో సత్తా చాటారు. తైక్వాండో అండర్​80 కేజీ కేటగిరిలో ఎస్.నితీశ్​కుమార్ గోల్డ్ మెడల్, ప్రణయ్ సిల్వర్​మెడల్, అండర్​54 కేజీ కేటగిరిలో బి.గౌరి సిల్వర్ మెడల్, 58 కేజీల విభాగంలో ఎ.పురుషోత్తం బ్రాంజ్​మెడల్

63 కేజీల కేటగిరి ఓవర్ ఆల్ ఛాంపియన్​షిప్​లో ద్వితీయస్థానంలో నిలిచారు.  అలాగే ఓయూ ఇంటర్ కాలేజీ కబడ్డీ మెయిన్స్ చాంపియన్ షిప్​ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు రసవత్తరంగా జరిగాయి. సెమీఫైనల్ లో అంబేద్కర్ కాలేజీ స్టూడెంట్లు తృతీయ స్థానంలో నిలిచారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అంబేద్కర్​ఇనిస్టిట్యూషన్స్​కరస్పాండెంట్ డాక్టర్ జి.సరోజావివేక్ బుధవారం సన్మానించారు. మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.