
జీడిమెట్ల, వెలుగు: గాజులరామారం సర్కిల్ పరిధి సూరారంలో జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్అధికారులు గురువారం కూల్చివేతలు చేపట్టారు. సిద్ధి వినాయక నగర్లో ముగ్గురు వ్యక్తులు స్టిల్ప్లస్టూ పర్మిషన్తీసుకొని అదనంగా మరో రెండు అంతస్తులు, పెంట్ హౌజ్నిర్మిస్తున్నారు. దీనిపై ఆర్.కె.ట్రాన్స్ పోర్ట్కు చెందిన జితేందర్అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని కోర్టును ఆశ్రయించాడు.
దీంతో కోర్టు ఆదేశాల మేరకు గురువారం రెండు భవనాల్లోని స్లాబ్లు, గోడలను పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేశారు. కాగా, టౌన్ప్లానింగ్అధికారులు రూ.20 లక్షలు లంచం అడిగారని, అంత మొత్తం ఇవ్వలేమని చెప్పడంతోనే కూల్చివేతలు చేశారని బాధితులు ఆరోపించారు. తాము కోర్టు ఆదేశాల ప్రకారమే కూల్చివేతలు చేసినట్లు టౌన్ప్లానింగ్ అధికారులు తెలిపారు.