
- తాగిన మైకంలో గొడవ
- ఆటోలో తీసుకుపోయి అంతం చేసిన ఫ్రెండ్
నర్సాపూర్, వెలుగు : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కొండాపూర్ ఫారెస్ట్ లో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఎస్సై శివకుమార్ కథనం ప్రకారం..హైదరాబాద్లోని బోరబండ కు చెందిన నోమన్ (26), ఫారుక్ స్నేహితులు. రెండు రోజుల కింద తాగి ఓ వైన్ షాప్ వద్ద గొడవపడ్డారు. మాటా మాటా పెరిగి నోమన్, ఫారుక్ కొట్టుకున్నారు. ఇద్దరూ కంప్లయింట్ ఇవ్వడానికి పీఎస్కు వెళ్లారు.
అయితే, ఫారుక్.. నోమన్కు సర్ది చెప్పాడు. దోస్తుల మధ్య ఇదంతా ఏందని చెప్పి ట్రీట్మెంట్చేయిస్తానని గాంధీ దవాఖానకు తీసుకుపోయాడు. అక్కడి నుంచి ఆటోలో నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియాలోని కొండాపూర్ శివారుకు తీసుకువెళ్లాడు. ఇద్దరూ మందు తాగారు. పాత గొడవను మనసులో పెట్టుకున్న ఫారుఖ్..నోమన్ను కత్తితో పొడిచి చంపాడు. నర్సాపూర్ పీఎస్కు వెళ్లి లొంగిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.