హైదరాబాద్​లో కిడ్నాప్​ కలకలం: వడ్డీ వ్యాపారిపై పేట్​ బషీరాబాద్​ పోలీసులు కేసు నమోదు

హైదరాబాద్​లో కిడ్నాప్​ కలకలం:  వడ్డీ వ్యాపారిపై పేట్​ బషీరాబాద్​ పోలీసులు కేసు నమోదు

హైదరాబాద్ మహానగరం శివారులో కిడ్నాప్​  కలకలం రేగింది.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ యువకుడిని ఫైనాన్సర్​ శ్రీనాథ్​ రెడ్డి కొట్టి కిడ్నాప్​చేశాడని కేసు నమోదైంది. ఈ ఘటనకు  సంబంధించి  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...  న్యూ ఇయర్ వేడుకల కోసం పైనాన్సర్​ శ్రీనాథ్​రెడ్డి దగ్గర .... యశ్వంత్​ అనే వ్యక్తి  రూ. 5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 

తిరిగి డబ్బులు చెల్లించే విషయంలో కాలయాపన చేస్తూ.. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో... సహనం కోల్పోయిన ఈ నెల 14 న హోలీ రోజున  శ్రీనాథ్​ గ్యాంగ్​ ...యశ్వంత్​ను కిడ్నాప్​ చేసి బజాజ్ షో రూమ్ గ్రౌండ్స్ లో తీవ్రంగా దాడి చేశారని యశ్వంత్​ తల్లి.. పైనాన్సర్​ శ్రీనాథ్​​ సహా మరో 15 మందిపై  కేసు పెట్టింది. తన కుమారుడు కనిపించడం లేదని బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.   మిస్సింగ్​ కంప్లయింట్​ అందుకున్న పోలీసులు బీఎన్​ఎస్​ సెక్షన్ల ప్రకారం 118(1), 127(2) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

ఫైనాన్సర్​ శ్రీనాథ్​ రెడ్డి వడ్డీ వ్యాపారం చేస్తూ 10 నుంచి 15 రూపాయిల వరకు వసూలు చేస్తున్నాడని ఆరోపణలున్నాయి.  బాధితుడు యశ్వంత్​ను కిడ్నాప్​ చేసిన గ్యాంగ్​ బీర్ బాటిల్స్, హాకీ స్టిక్స్, కర్రలు, బెల్ట్ తో దాడి చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.