గేమ్స్ పీరియడ్కు ​రాలేదని.. కరెంట్ వైర్తో చితకబాదిన పీఈటీ.. కీసర జడ్పీ హైస్కూల్లో ఘటన

గేమ్స్ పీరియడ్కు ​రాలేదని.. కరెంట్ వైర్తో చితకబాదిన పీఈటీ.. కీసర జడ్పీ హైస్కూల్లో ఘటన

కీసర, వెలుగు: కీసర జడ్పీ హైస్కూల్లో పీఈటీ ఆనంద్​కర్కశంగా వ్యవహరించాడు. గేమ్స్ పీరియడ్​లో ఆటలు ఆడేందుకు రాలేదని 8 మంది బాలికలను కరెంట్ వైర్​తో గొడ్డును బాదినట్టు బాదాడు. వివరాల్లోకి వెళ్తే.. కీసర జడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రణతి, వైశాలి, కావ్య, నవ్య, శరణ్య, అర్చన, బ్లేస్సీ, కీర్తన గురువారం సాయంత్రం గేమ్స్ పీరియడ్​కు వెళ్లలేదు. 

దీంతో ఒంట్లో బాగాలేదన్నా వినకుండా వారిని పీఈటీ ఆనంద్​కరెంట్​వైర్​తో చితకబాదాడు. అనంతరం ఇంటికి వెళ్లిన విద్యార్థులు జరిగిన విషయాన్ని చెప్పగా, వారి ఒంటిపై గాయాలు చూసి పేరెంట్స్ షాక్​కు గురయ్యారు. శుక్రవారం ఉదయం స్కూల్​ఎదుట ఆందోళన దిగారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎంఈఓ జనార్ధన్ ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. 

అప్పటికే మీడియాలో వచ్చిన కథనాలు చూసి పీఈటీ ఆనంద్​ను సస్పెండ్ చేస్తూ డీఈఓ విజయ్ కుమారి ఉత్తర్వులు
 జారీ చేశారు.