మాదాపూర్ హైటెక్స్లో శుక్రవారం పెటెక్స్ ఎక్స్ పో, కిడ్స్ ఫెయిర్, కిడ్స్ కార్నివాల్ మొదలయ్యాయి. మూడ్రోజులపాటు ఉదయం10 గంటల నుంచి రాత్రి 8 వరకు కొనసాగనున్నాయి. టర్కీ, చెక్ రిపబ్లిక్, జపాన్, సింగపూర్, జర్మనీ దేశాలతోపాటు దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన కళాకారులు, జంతు ప్రేమికులు, ఎంటర్ప్రెన్యూర్లు స్టాల్స్ ఏర్పాటు చేశారు. మొదటిరోజు పెటెక్స్లో నిర్వహించిన గుర్రాల జంప్ షో, ఇంటర్నేషనల్ క్యాట్ చాంపియన్షిప్, డాగ్స్ఫ్యాషన్, టాలెంట్ షోలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
Also Read :- తెలంగాణలో తగ్గిన నిరుద్యోగం
క్యాట్చాంపియన్ షిప్లో 200 రకాల పిల్లులు పాల్గొంటున్నాయి. మైనేకూన్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద పెంపుడు పిల్లి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది. శనివారం సాయంత్రం కిడ్స్ 4కె, 2కె, 1కె రన్ నిర్వహిస్తున్నట్లు హైటెక్స్ బిజినెస్ హెడ్శ్రీకాంత్తెలిపారు. కిడ్స్కార్నివాల్లో 90 మంది కిడ్స్ప్రెన్యూర్లు పాల్గొంటున్నారన్నారు.
– వెలుగు, మాదాపూర్