పెట్రోల్ ఓవర్ ఫ్లో..మంటలు చెలరేగి బైక్ దగ్ధం

పెట్రోల్ ఓవర్ ఫ్లో..మంటలు చెలరేగి బైక్ దగ్ధం
  • జీడిమెట్ల బస్ డిపో వద్ద ఘటన

జీడిమెట్ల, వెలుగు: పెట్రోల్ ఓవర్ ఫ్లో అయి మంటలు చెలరేగి బైక్ దగ్ధమైన ఘటన సూరారం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్​నగర్​కు చెందిన సింహాచలం(30) ఇటీవల కొత్త బైక్ కొన్నాడు. మంగళవారం చింతల్​లో ఉండే తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చాడు. తిరిగి వెళ్తూ జీడిమెట్ల బస్ డిపో వద్ద ఉన్న పెట్రోల్ బంక్​లో ట్యాంక్​ ఫుల్ చేయించాడు.

కొంచెం ముందుకు వెళ్లగానే పెట్రోల్ ఓవర్ ఫ్లో అయ్యి ఇంజిన్​పై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సింహాచలం వెంటనే బైక్ పై నుంచి దిగిపోయాడు. జీడిమెట్ల ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే బైక్ పూర్తిగా మంటల్లో దగ్ధమైంది.