
హైదరాబాద్, వెలుగు: ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ కు గురువారం నాటికి 7,706 అప్లికేషన్లు వచ్చాయని పీజీఈసెట్ కన్వీనర్ అరుణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 14 పేపర్లకు ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా, దీంట్లో ఫార్మసీకి అత్యధికంగా 3,179 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 1,984, ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో 761, సివిల్ ఇంజినీరింగ్ లో 631, ఎలక్ర్టికల్ ఇంజినీరింగ్ లో 485, మెకానికల్ ఇంజినీరింగ్ లో 238 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.రూ.వెయ్యి ఫైన్తో శుక్రవారం వరకు, రూ.2,500 ఫైన్ తో ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.