ఫిలిప్పీన్స్‌‌‌ మంత్రితో ఉత్తమ్​ చర్చలు

ఫిలిప్పీన్స్‌‌‌ మంత్రితో ఉత్తమ్​ చర్చలు

హైదరాబాద్, వెలుగు: ఫిలిప్పీన్స్ వ్యవసాయ మంత్రి రోజర్స్ తో సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. ఫిలిప్పీన్స్ కు 3 లక్షల టన్నుల వరకు వరి ఎగుమతి చేసే అవకాశాలపై స్నేహపూర్వకంగా చర్చించారు. నాణ్యత కారణాలతో ఫిలిప్పీన్స్ గత కొన్నేండ్లుగా భారత్ నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో బియ్యం ఎగుమతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశంతో చర్చలు జరిపింది. ఈ చర్చలు కార్యరూపం దాల్చితే  రాష్ట్ర  బియ్యం ఫిలిప్పీన్స్ కు ఎగుమతి అవుతోంది.