బస్సులో ఫోన్ కొట్టేసి.. అకౌంట్​ ఊడ్చేశారు!

బస్సులో ఫోన్ కొట్టేసి.. అకౌంట్​ ఊడ్చేశారు!

బషీర్​బాగ్, వెలుగు: ఆర్టీసీ బస్సులో దుండగులు ఫోన్ ​కొట్టేసి, అకౌంట్​నుంచి డబ్బులు కాజేశారు. హైదరాబాద్ కు చెందిన 45 ఏండ్ల ప్రైవేటు ఉద్యోగిని ఇటీవల తార్నాక నుంచి కాచిగూడకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది. జర్నీలో తన మొబైల్ ను పోగొట్టుకోగా  కాచిగూడ పీఎస్​లో ఫిర్యాదు చేసింది.

  కాసేపటికే ఆమె ఎస్బీఐ అకౌంట్ నుంచి  లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేయగా రూ.1.04 లక్షలు డెబిట్ అయ్యాయి.   బాధిత మహిళ ఆన్​లైన్​లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ తెలిపారు.