చివరి దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ..

చివరి దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విచారణ చివరిదశకు చేరుకుంది. SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసే పనిలో పడ్డారు అధికారులు.  ప్రభాకర్ రావును ఇండియాకు రప్పిస్తే తప్ప.. అసలు దోషులు బయటకొచ్చే ఛాన్స్ లేదంటున్నారు.

ఈ కేసులో మోస్ట్  వాంటెడ్ లిస్టులో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ఉన్నారు. ఇప్పటికే భుజంగరావు. ప్రణీత్ రావు,రాధాకిషన్, తిరుపతన్న లు ఈ కేసులో అరెస్టు అయ్యారు.కేసులో కీలక ఆధారాలు హార్డ్ డ్రైవ్ లు, సాక్ష్యాలను నాశనం చేశారు నిందితులు. ఈకేసులో ప్రభాకర్ రావును విచారిస్తే తప్ప.. అసలు విషయాలు బయకొచ్చే ఛాన్స్ కనిపిస్తున్నాయి.