ఫోన్​పే గ్రూప్ లాభం రూ. 197 కోట్లు

ఫోన్​పే గ్రూప్ లాభం రూ. 197 కోట్లు

న్యూఢిల్లీ: వాల్‌‌‌‌మార్ట్​కు చెందిన ఫోన్​పే గ్రూప్ 2023–-24 ఆర్థిక సంవత్సరానికి (ఈసాప్​ ఖర్చులను మినహాయించి) రూ. 197 కోట్ల నికర లాభాన్ని (స్టాండెలోన్​) సాధించింది.  గత ఆర్థిక సంవత్సరంలో రూ.738 కోట్ల నష్టాన్ని చవిచూసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.  2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 5,064 కోట్ల ఆదాయం రాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,914 కోట్లు వచ్చాయి.  

పేమెంట్స్​ బిజినెస్​ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 710 కోట్ల స్వతంత్ర నికర లాభాన్ని (ఈసాప్​ ఖర్చులను మినహాయించి) సంపాదించింది.  మునుపటి ఆర్థిక సంవత్సరంలో రూ. 194 కోట్ల నష్టం వచ్చింది.