పబ్లిక్​ కంపెనీగా ఫోన్​పే.. త్వరలోనే ఐపీఓ

పబ్లిక్​ కంపెనీగా ఫోన్​పే.. త్వరలోనే ఐపీఓ

న్యూఢిల్లీ: యూపీఐ సేవలను అందించే ఫోన్​పే ఐపీఓ కు రాకముందే పబ్లిక్ కంపెనీగా మారింది.  కంపెనీ తన షేర్లను ప్రజలకు విక్రయించడానికి తప్పనిసరిగా పబ్లిక్​సంస్థగా మారాల్సి ఉంటుంది. సంస్థ పేరు ఫోన్​పే ప్రైవేట్​ లిమిటెడ్​ నుంచి ఫోన్​పే లిమిటెడ్​గా మారింది. కొత్త పేరుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది.