మణుగూరులో జీవీ మాల్ ప్రారంభం : ఎమ్మెల్యే పాయం

మణుగూరులో జీవీ మాల్ ప్రారంభం : ఎమ్మెల్యే పాయం
  • ఎమ్మెల్యే పాయం,  సినీనటి అనసూయ హాజరు 

మణుగూరు, వెలుగు: వస్త్ర వ్యాపార దిగ్గజం జీవీ మాల్ 18వ బ్రాంచ్ ను మణుగూరులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. సినీనటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరులో గుర్రం బ్రదర్స్ జీవీ మాల్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 

ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు తక్కువ ధరల్లో వస్త్రాలు అందించాలని కోరారు. అనసూయ మాట్లాడుతూ తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు జీవి మాల్ లో లభ్యమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీ మాల్ గ్రూప్ చైర్మన్ గుర్రం ఉమామహేశ్వరరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, సెక్రటరీలు దోసపాటి వెంకటేశ్వరరావు, దండా రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.