
హైదరాబాద్ సిటీ, వెలుగు : మెహిదీపట్నం పరిధిలోని భోజగుట్టలో శుక్రవారం 250 ఎంఎం డయా పైపులైన్ 3 మీటర్ల మేర కుంగింది. భోజగుట్ట నుంచి ఖాదర్బాగ్, సాలార్గంజ్ కాలనీ, మిలిటరీ ఏరియా అవుట్లెట్ వరకు ఈ పైప్ లైన్ఉంటుంది. టన్నెలింగ్ పనులు చేసేటప్పుడు అధికారులు పైపులైన్ కు లీకేజీని గుర్తించారు. అప్రమత్తమైన వాటర్బోర్డు అధికారులు రిపేర్లు చేపట్టారు.