
పిట్లం, వెలుగు: రెండు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ కబాడ్డీ పోటీలో జిల్లా విజేతగా పిట్లం జట్టు నిలిచింది. బుధవారం కామారెడ్డి సరస్వతి శిశుమందిర్ మైదానంలో జరిగిన ఫైనల్లో పిట్లం జట్టు తాడ్వాయి జట్టుపై మూడు పాయింట్ల తేడాతో గెలుపొందినట్లు పిట్లం హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ సంజీవులు తెలిపారు. హోరా హోరీగా జరిగిన ఫైనల్స్లో తాడ్వాయి జట్టుపై 19,16 పాయింట్ల తేడాతో గెలుపొందినట్లు చెప్పారు. పిట్లం జట్టును జిల్లా స్థాయిలో విజేతగా నిలిపినందుకు క్రీడాకారులను ఎంపీడీవో కమలాకర్, ఎంఈవో దేవీసింగ్ అభినందించారు.