
రంగారెడ్డి :ప్లాస్టిక్ గోడౌన్ లో పేలుడు జరగడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం బుధవారం మధ్నాహ్నం రంగారెడ్డి జిల్లా, మైలార్ దేవ్ పల్లిలో జరిగింది. ఓ ప్లాస్టిక్ వ్యర్థాల గోడౌన్ లో కెమికల్ డబ్బాలు పేలాయి. పేలుడు ధాటికి ఓ కార్మికుడికి కాలు విరిగింది. సమాచారం అందుకున్న సీఐ సత్తయ్య టీమ్ దర్యాప్తు చేసేందుకు వెళ్లారు. గోడౌన్ ఓపెన్ చేస్తుండగా మరో పేలుడు జరిగింది. సీఐ సత్తయ్యకు, కార్పొరేటర్ మెస్బా ఉద్దీన్ కు గాయాలయ్యాయి. వెంటన్ హస్పిటల్ కి తరలించిన పోలీసులు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.