వికారాబాద్ జిల్లా క్రికెట్ టోర్నీలో మ్యాచ్​ ఫిక్సింగ్​కు నో చెప్పాడని..ప్లేయర్ పై దాడి

వికారాబాద్ జిల్లా క్రికెట్ టోర్నీలో మ్యాచ్​ ఫిక్సింగ్​కు నో చెప్పాడని..ప్లేయర్ పై దాడి
  • పరిగి ప్రీమియర్ లీగ్​లో ఘటన ఆలస్యంగా వెలుగులోకి..

పరిగి, వెలుగు: క్రికెట్ టోర్నీలో మ్యాచ్​ఫిక్సింగ్​కు అంగీకరించని ప్లేయర్​పై కొందరు దాడికి తెగబడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి మినీ స్టేడియంలో కొద్దిరోజులుగా పరిగి ప్రీమియర్ లీగ్ (పీపీఎల్) పేరిట క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్​లో కొంతమంది నేరుగా ఆటను చూస్తూనే  బెట్టింగులు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం 1X బెట్టింగ్ యాప్ వాడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 12న శనివారం రాత్రి బెట్టింగ్ వ్యవహారమై ఒక టీం ప్లేయర్, యజమాని మధ్య గొడవ జరిగింది.

1X లో బెట్టింగ్ చేసి ఓడిపోవాలని నిర్వాహకుడు తన ఆటగాళ్లకు సూచించగా, ఇందుకు మన్నన్ అనే యువకుడు నిరాకరించాడు. బ్యాటింగ్​లో ఔట్ కావాలని చెప్పగా, ఒప్పుకోలేదు. దీంతో మ్యాచ్ అయ్యాక తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. తల, భూజానికి గాయాలు కావడంతో ఆదివారం పరిగి పీఎస్​లో ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ సోమవారం తెలిపారు.