విజయదశమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

విజయదశమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

ఢిల్లీలోని మాధవ్ దాస్ పార్క్‌లో ధార్మిక్ లీలా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వీరివురూ చేతుల్లో విల్లు, బాణం పట్టుకుని రావణ దహనం చేశారు. అంతకుముందు మోదీ, ముర్ము.. శ్రీరాముడు, లక్ష్మణుడి పాత్రలు పోషిస్తున్న కళాకారుల నుదుటిపై తిలకం రుద్దారు.