మస్క్‎కు ప్రధాని మోడీ ఫోన్.. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే..?

మస్క్‎కు ప్రధాని మోడీ ఫోన్.. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే..?

న్యూఢిల్లీ: టెస్లా, స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థలు భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్న వేళ ఆ సంస్థల యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రధాని మోదీ ఫోన్‎లో చర్చలు జరిపారు. టెక్, ఇన్నోవేషన్‎పై మస్క్​తో చర్చించినట్టు మోదీ తన ఎక్స్​ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘‘టెస్లా సీఈతో ఎలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ రోజు ఫోన్​కాల్‎లో మాట్లాడా.

ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భేటీ సందర్భంగా మా ఇద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలను గుర్తుచేసుకున్నాం. టెక్నాలజీ, ఇన్నోవేషన్​రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించాం. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టుబడి ఉంది’’ అని మోదీ వెల్లడించారు.

ఇండియాలోకి ఎంటర్​కానున్న టెస్లా..!

ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటనలో భాగంగా ఎలాన్​ మస్క్‎తో మోదీ భేటీ ఆయ్యారు. ఆ సమయంలో స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ రంగాలపై ఇరువురూ చర్చలు జరిపారు. అనంతరం కొద్దిరోజులకే భారత్‎లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు టెస్లా కంపెనీ ప్రకటించింది. రాబోయే నెలల్లోనే ముంబై సమీపంలోని పోర్ట్‎కు కొన్ని వేల కార్లను రవాణా చేయడం ద్వారా టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నదని బ్లూమ్​బర్గ్​రిపోర్ట్‎లో వెల్లడించింది. 

మరోవైపు ఇండియాలో స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాటిలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జియో, సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారతీ మిట్టల్‎కు చెందిన భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒప్పందం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రధాని మోదీ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

ఈ నెల 21న భారత్ కు జేడీ వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈనెల 21న భారత్‎కు రానున్నారు. నాలుగు రోజుల పాటు ఇండియాలో ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో వాన్స్ భేటీ అవుతారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో మోదీ పర్యటన సందర్భంగా ప్రకటించిన ‘ఇండియా–అమెరికా టెక్నాలజీ పార్ట్ నర్ షిప్  ట్రస్ట్’ను ఇద్దరు నేతలు ప్రారంభిస్తారు. అమెరికా, ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, వాన్స్  సమీక్షిస్తారు.