గత ప్రభుత్వాలు జమ్ము కాశ్మీర్ ను దోచుకున్నాయి.. ప్రధాని మోడీ

గత ప్రభుత్వాలు జమ్ము కాశ్మీర్ ను దోచుకున్నాయి.. ప్రధాని మోడీ

శ్రీనగర్:  జమ్ము కాశ్మీర్ లో ప్రజాస్వామ్య బలోపేతానికి ఇక్కడి ప్రజలు చేస్తున్న కృషిని ప్రపంచమంతా చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు శ్రీనగర్ లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గతంలో కాశ్మీర్ ను కాంగ్రెస్, పీడీపీ, ఎన్సీ పార్టీలు దోచుకున్నాయి.

గతంలో యువత చేతిలో రాళ్లు, కర్రలు ఉండేవి. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రస్తుతం కాశ్మీర్  యువత చేతిలో పెన్నులు, పుస్తకాలు కనిపిస్తున్నాయి. కాశ్మీర్ ప్రజలు మోదీ గ్యారంటీలపై నమ్మకం పెట్టుకున్నారని వెల్లడించారు.