కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ రెండు రోజుల పర్యటనకు సంబంధించిన ఫోటోలను మోదీ తన ట్విట్టర్ లో పంచుకుకున్నారు. ఈ ద్వీపాల ఎంతో అద్భుతంగా ఉన్నాయన్న మోదీ... ఇక్కడి ప్రజలు అందించిన అతిథ్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెల్లవారుజామునుంచే బీచ్ వెంట నడుస్తూ ఆహ్లాదాన్ని పొందానని తన ట్వీట్ లో తెలిపారు.
For those who wish to embrace the adventurer in them, Lakshadweep has to be on your list.
— Narendra Modi (@narendramodi) January 4, 2024
During my stay, I also tried snorkelling - what an exhilarating experience it was! pic.twitter.com/rikUTGlFN7
స్నార్కలింగ్ చేసినట్లు ఫొటో, బీచ్ పక్కన కూర్చని బుక్ చదువుతున్న ఫోటోలను మోదీ షేర్ చేశారు. 140కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఈ వాతావరణం తనకు నేర్పిందన్న మోదీ.. సాహసాలు చేయాలనుకునేవారు.. మీ లిస్ట్లో లక్షద్వీప్ను కూడా చేర్చుకోండి అని సూచించారు.
And those early morning walks along the pristine beaches were also moments of pure bliss. pic.twitter.com/soQEIHBRKj
— Narendra Modi (@narendramodi) January 4, 2024
లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని మోదీ రూ.1,150 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. మోదీ చేసిన స్నోర్కెలింగ్ యాక్టివిటీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.