భారత్, అమెరికా కీలక ఒప్పందం.. 2030 నాటికి 500బిలియన్ డాలర్ల వాణిజ్యం: ప్రధానిమోదీ

భారత్, అమెరికా కీలక ఒప్పందం.. 2030 నాటికి 500బిలియన్ డాలర్ల వాణిజ్యం: ప్రధానిమోదీ

గురువారం (ఫిబ్రవరి 14) అమెరికా వైట్ హౌజ్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణతో సహా పలు రంగాల్లలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు బలోపేతం చేయాలని ఈ చర్చల్లో నిర్ణయించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచాలని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు వాణిజ్యం చేరుకోవాలని లక్ష్యంగా ఇరు దేశాల నేతలు ఒప్పందాలు చేసుకున్నారు. 

స్వేచ్చాయుత వాణిజ్యం, వలసలపై కూడా చర్చించారు. ఇండోపసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితి వంటి భౌగోళిక రాజకీయ అంశాలపై రెండు దేశాల ఐక్యతను బలో పేతం చేశారు. మరోవైపు ప్రపంచశాంతి, ప్రపంచ ఉగ్రవాదంపై పోరాటంలో సహకరించుకునేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు. 

Also Read :- ముగిసిన అమెరికా టూర్

ట్రంప్ తో భేటీలో ప్రధాని  మోదీ మాట్లాడుతూ.. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మెగా)అనేనినాదంతో ట్రంప్ ముందుకెళ్తున్నారు..  అదేవిధంగా మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్ నినాదంతో ఇండియా వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.  MIGA, MAGA కలిసి ఇరుదేశాల శ్రేయస్సుకోసం మెగా భాగస్వామ్యంలో పనిచేస్తున్నాని ప్రధాని మోదీ అన్నారు.