ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ!

ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ!

భారత ప్రధాని మోదీ త్వరలో ఉక్రెయిన్‌లో పర్యటించవచ్చని సమాచారం. ఆగస్ట్ 23న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో భేటీ కానున్నారు. ఈ విషయం ఇంకా అధికారికంగా పీఎంవో ఆఫీస్ ఇంకా ప్రకటించలేదు. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి. ఇటలీలో జూన్ లో జరిగిన జీ7 సమావేశాల సందర్భంగా ఇరువురు నేతలు కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ తాజా పరిస్థితులపై చర్చించారు. కాగా, మోదీ జూలై 8న రష్యాలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఇప్పుడు ఉక్రెయిన్‌ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

ఇండియా,రష్యా 22వ వార్షిక సమావేశం కోసం జూన్ లో ప్రధాని రష్యాలో పర్యటించారు. రష్యాలో ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారాన్ని పుతిన్‌ అందజేశారు. కాగా, ఉక్రెయిన్‌పై 2022, ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య ప్రారంభించింది. 3 వారాల్లో ఆ దేశంలోని అన్ని ప్రధాన నగరాలను ఆక్రమించుకోవాలని పుతిన్‌ సైన్యం లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఉక్రెయిన్‌కు నాటో దేశాల మద్దతుతో మూడు వారాలు అనుకున్న యుద్ధం రెండున్నర ఏండ్లుగా కొనసాగుతూనే ఉన్నది. ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి.