
మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించామని ప్రధాని మోది మంగళవారం ( మార్చి 18)న లోక్ సభలో తెలిపారు. బాలరాముని ప్రతిష్ఠ జరిగిన ఏడాదికే ఉత్తరప్రదేశ్ లో మహాకుంభమేళా జరిగిందన్న ప్రధాని .. దేశ ఐక్యతను కుంభమేళా ద్వారా ప్రపంచానికి చాటిచెప్పామన్నారు. మహా కుంభ మేళా చారిత్ర ఘట్టమని.. తాను మారిషన్ వెళ్లినప్పుడు కుంభమేళా నీళ్లను తీసుకెళ్లానన్నానని తెలిపారు.
కుంభమేళాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఆవిష్కృతమయ్యాయని.. ఇది దేశ ప్రజల విజయమని లోక్ సభలో ప్రధాని మోదీ తెలిపారు, ప్రయాగ్ రాజ్ లో 66 కోట్ల మంది స్నానాలు చేశారని.. కుంభ మేళా విజయంతంతం కావడానికి అందరూ సహకరించారన్నారు, ఇది భవిష్యత్తు తరాలకు ఉదాహరణగా నిలుస్తుందని.... కుంభమేళాలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు.