ఎనర్జీ సెక్టార్కు మంచి ఫ్యూచర్ ఉంది..ఇన్వెస్ట్ చేయండి: ప్రధాని మోదీ

ఎనర్జీ సెక్టార్కు మంచి ఫ్యూచర్ ఉంది..ఇన్వెస్ట్ చేయండి: ప్రధాని మోదీ
  • ఇన్వెస్ట్​ చేయాలని కోరిన ప్రధాని

న్యూఢిల్లీ:మనదేశ ఎనర్జీ సెక్టార్లోని అపార అవకాశాలను పెట్టుబడిదారులు ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రాబోయే ఐదేళ్లలో 50 గిగావాట్ల రెన్యువబుల్​ఎనర్జీని ఉత్పత్తి చేయాలని టార్గెట్​గా పెట్టుకున్నామని అన్నారు. 

2030 నాటికి ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్​ హైడ్రోజన్​తయారు చేస్తామని చెప్పారు. ఆయిల్​, గ్యాస్ నిక్షేపాల కోసం బిడ్డింగ్​ నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని, ఢిల్లీలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్​ 2025ను ఉద్దేశించి వర్చువల్​గా ​ప్రసంగించారు. 

‘‘21వ శతాబ్దం ఇండియాదేనని నిపుణులు అందరూ అంటున్నారు. భారత్​ తన వృద్ధిని తాను ముందుకు తీసుకువెళ్లడమే కాదు.. ప్రపంచవృద్ధికి ఊతంగా ఉంటోంది. మనదేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. మన రాజకీయ వ్యవస్థ స్థిరంగా ఉంది. ఇండియా నుంచి ఎనర్జీ ట్రేడ్​ సులువు. ఆకర్షణీయం”అని ఆయన చెప్పారు.