
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఎన్నికల నగారా మోగనుంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామానికి సిద్దమవుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి రేసులో ముందుడగా బీజేపీ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉంది. ఈ క్రమంలో ఆ పార్టీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో వరసుగా పర్యటించనున్నారు. మూడు రోజుల గ్యాప్ లో మోదీ రెండు సార్లు రాష్ట్రానికి రానున్నారు.
2023 అక్టోబర్ 1న మహబూబ్నగర్ కు రానున్న మోదీ.. తిరిగి అక్టోబర్ 3న నిజామాబాద్ కు ప్రధాని రానున్నారు. ప్రధాని టూర్ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఈ రోజున నిజామాబాద్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మహబూబ్నగర్ కు లక్ష్మణ్ వెళ్లనున్నారు. పార్లమెంటులో మహిళా బిల్ పాసైనందున ప్రధానికి వినూత్నంగా స్వాగతం పలకాలని బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.
Also Read : గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసుల హై సెక్యూరిటీ
అందులో భాగంగా మహబూబ్నగర్లో మోదీకి ఓపెన్ టాప్ జీప్ ఏర్పాటు చేసి..మహిళలు ఆయనకు కృతజ్ఞతలు చెప్పేలా నేతలు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా మహబూబ్నగర్ రింగ్ రోడ్డుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇక అక్టోబర్ 3న నిజామాబాద్ లో రోడ్ షోతో పాటుగా భారీ బహిరంగ సభ ఉంటుందని తెలుస్తోంది.