
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు మోదీ. ఢిల్లీలోని సౌత్ బ్లాక్ కార్యాలయంలో వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సౌత్ బ్లాక్ సిబ్బంది మోదీకి చప్పట్లతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం పీఎం కిసాన్ నిధి డబ్బులు రిలీజ్ చేస్తూ ఫైలుపై మొదటి సంతకం చేశారు మోదీ. దీంతో 20 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఈ సందర్బంగా మాట్లాడిన మోదీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రైతుల కోసం, వ్యవసాయ రంగం కృషి కోసం మరింత కృషి చేస్తామని చెప్పారు మోదీ.
ప్రధాని మోదీ జూన్ 10 న సాయంత్రం 5 గంటలకు తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉంది.
రాష్ట్రపతి భవన్లో జూన్ 9 న మోదీతో పాటు 71మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. మంత్రి మండలిలో 30 మంది క్యాబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర మంత్రులు ఉన్నారు.
#WATCH | PM Narendra Modi today took charge as the Prime Minister, in New Delhi.
— ANI (@ANI) June 10, 2024
After being sworn in as Prime Minister for the 3rd time, PM Narendra Modi signed his first file authorising the release of 17th instalment of PM Kisan Nidhi. This will benefit 9.3 crore farmers and… pic.twitter.com/G4ownB0NFh