న్యూఢిల్లీ: అమ్మకాలు, ఉత్పత్తిలో స్వల్ప పెరుగుదల కారణంగా జనవరిలో మన దేశ సేవల రంగం కార్యకలాపాలు గత రెండు సంవత్సరాలలో ఎన్నడూ లేనంత తక్కువ వేగంతో విస్తరించాయని బుధవారం ఒక నెలవారీ సర్వే తెలిపింది. కాలానుగుణంగా మారే హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్యాక్టివిటీ ఇండెక్స్ డిసెంబర్లో 59.3 నుంచి జనవరిలో 56.5కి పడిపోయింది. గత నవంబర్ తర్వాత ఇది అత్యల్ప స్థాయి. పర్చేజింగ్మేనేజింగ్ఇండెక్స్(పీఎంఐ) 50 కంటే ఎక్కువ ఉంటే సానుకూలంగా ఉన్నట్టు. లేకపోతే తక్కువగా ఉన్నట్టు భావిస్తారు.
"జనవరిలో భారత సేవల రంగం వృద్ధి ఊపును కోల్పోయింది. అయినప్పటికీ పీఎంఐ 50 -బ్రేక్- ఈవెన్ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉంది. వ్యాపార కార్యకలాపాలు, కొత్త వ్యాపార పీఎంఐ సూచికలు వరుసగా నవంబర్ 2022, నవంబర్ 2023 తర్వాత అత్యల్ప స్థాయికి తగ్గాయి" అని హెచ్ఎస్బీసీలో చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రాంజుల్ భండారి అన్నారు.