warangal : బాలికపై అత్యాచార యత్నం.. సీఐపై ఫోక్సో కేసు

warangal :  బాలికపై అత్యాచార యత్నం.. సీఐపై ఫోక్సో కేసు

రక్షణ కల్పించాల్సిన ఖాకీలే కాటేస్తున్నారు. కామాంధులుగా మారి అత్యాచారాలకు  పాల్పడుతున్నారు.  వరంగల్ జిల్లా ఖాజీపేటలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో  బాలికపై సీఐ రవికుమార్  అత్యాచారయత్నం చేశాడు.  అక్టోబర్ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పోలీసుల వివరాల ప్రకారం..హన్మకొండ  వడ్డెనపల్లిలో  పీజీఆర్  లేక్ వ్యూలో ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు సీఐ రవికుమార్.    అక్టోబర్ 9న సాయంత్రం అదే అపార్ట్ మెంట్ లోని  కారిడార్ లో తన ఫ్రెండ్ తో మాట్లాడుతున్న ఓ బాలికను సీఐ రవికుమార్ తన బెడ్రూంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సీఐ చెర నుంచి తప్పించుకున్న బాలిక  తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఆ బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో అక్టోబర్ 22న  సీఐపై ఫోక్సో కేసు నమోదు చేశారు ఖాజీపేట  పోలీసులు. 

ALSO READ | వరంగల్ లో హోంగార్డు హల్ చల్