
- భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడానికి ముందు హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1948 సెప్టెంబర్ 13న స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు.
- భారత సైన్యాలు హైదరాబాద్ రాజ్య సరిహద్దుల్లో మోహరించడంతో నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వంతో 1947 నవంబర్ 29న యథాతథ స్థితి ఒప్పందం చేసుకుంది.
- యథాతథస్థితి ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ రాజ్య విదేశీ వ్యవహారాలను 1948 నవంబర్ 29 వరకు భారత ప్రభుత్వానికి అప్పగించారు.
- భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న నిజాం ఇంగ్లాండ్, అమెరికా, ఇతర రాజ్యాల నుంచి సహకారానికి ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపారు.
- ఆయుధాలు సమకూర్చుకోవడానికి నిజాం ఇంగ్లండ్ పంపిన మిలటరీ జనరల్ అహ్మద్ సయ్యద్, ఎల్. ఎడ్రూస్.
- నిజాం ఇంగ్లాండ్లో సిడ్నికాటన్, హెన్రీలష్విజ్ ద్వారా ఆయుధాలు సరఫరాకు ఒప్పంద కుదుర్చుకున్నారు.
- మందుగుండు సామగ్రి కోసం నిజాం ఒప్పందం కుదుర్చుకున్న మాజీ బ్రిటీష్ సైనికాధికారి టి.టి.మూర్.
- భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న విదేశీ వ్యవహారాల ఒప్పందానికి విరుద్ధంగా హైదరాబాద్ నిజాం భారత్ సెక్యూరిటీల నుంచి పాకిస్తాన్కు రూ.20కోట్లు రుణంగా ఇచ్చారు.
- 1948 ఆగస్టు 24న భారత ప్రభుత్వంపై సర్ వాల్టర్ మాంక్టన్ సహాయంతో ఐక్యరాజ్యసమితికి అధికారికంగా ఫిర్యాదు చేసిన హైదరాబాద్ రాజ్య ప్రధాన మంత్రి మీర్ లాయక్ అలీ.
- రాజగోపాలాచారి భారత గవర్నర్ జనరల్గా 1948 జూన్ 21న పదవిని చేపట్టారు.
- హైదరాబాద్ రాజ్యానికి పెద్ద మద్దతుదారుడైన పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ మహ్మద్ అలీ జిన్నా.
- 1948 సెప్టెంబర్ 12న మహ్మద్ అలీ జిన్నా మరణించారు.
- హైదరాబాద్ రాజ్యంపై భారత సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు.
- హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టులు, రజాకార్లు సాగిస్తున్న హింసా ప్రతిహింసలకు వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలీ నిర్వహిస్తున్నట్లు పాకిస్తాన్ హైకమిషనర్కు, అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది.
- ఒక స్వతంత్ర రాజ్యంపై మరో స్వతంత్ర రాజ్యం సైనిక చర్య చేపట్టడం ఐక్యరాజ్యసమితి ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం కాబట్టి హైదరాబాద్ పై భారత ప్రభుత్వం సైనిక చర్య చేపట్టినప్పటికీ దానికి పోలీసు చర్య అని పేరు పెట్టారు.
- హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్యకు అయ్యే ఖర్చును విద్యా శాఖ ఖాతాలో జమ చేశారు.
- హైదరాబాద్పై సైనిక చర్య లెఫ్టినెంట్ జనరల్ మహరాజ్ సింగ్ నేతృత్వంలో జరిగింది.
- హైదరాబాద్ రాజ్యంపై షోలాపూర్ వైపు నుంచి మేజర్ జనరల్ జేఎన్ చౌదరి దాడులు చేశారు.
- హైదరాబాద్ రాజ్యంపై విజయవాడ వైపు నుంచి మేజర్ జనరల్ రుద్ర దాడులు చేశారు.
- నిజాం రాజ్యంలో భారత ఏజెంట్ జనరల్ కె.ఎం.మున్షీ.
- భారత సైన్యానికి ఎప్పటికప్పుడు నిజాం రాజ్య సైన్యాధిపతి మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ ఇఎల్ ఎడ్రూస్ సమాచారం అందించారు.
- మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలోని భారత సేనలు హైదరాబాద్ నగరంలోకి 1948 సెప్టెంబర్ 17న ప్రవేశించారు.
- నిజాం రాజ్య సైన్యాధిపతి మేజర్ జనరల్ ఇఎల్ ఎడ్రూస్ భారత మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ముందు 1948 సెప్టెంబర్ 18న లొంగిపోయాడు.
- నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన ప్రభుత్వం రాజీనామా చేస్తున్నట్లు దక్కన్ రేడియో ద్వారా 1948 సెప్టెంబర్ 17న ప్రకటన చేశారు.
- భారత సైన్యాలు సికింద్రాబాద్లోని బొల్లారంలో బస చేయడానికి అనుమతిస్తున్నట్లు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1948 సెప్టెంబర్ 17 నాటి రేడియో ప్రకటనలో పేర్కొన్నారు.
- భారత ప్రభుత్వం కొత్త మంత్రి వర్గాన్ని, కొత్త ప్రధాన మంత్రిని నియమించేంత వరకు నిజాంకు పరిపాలనలో తోడ్పడటానికి ఆరుగురితో కమిటీ వేశారు. 1. బెరార్ యువరాజు ప్రిన్స్ ఆజంజా, సర్వే సేనాని, 2. మేజర్ జనరల్ సయ్యద్ ఇఎల్ ఎడ్రూస్– కమాండర్, 3. నవాబ్ దీన్యార్ జంగ్ – పోలీస్ కమిషనర్, 4. జి.రామాచారి–వకీలు, 5. అబుల్ హసన్ సయ్యద్ అలీ – ఇత్తేహాదుల్ ముస్లిమీన్ మాజీ అధ్యక్షుడు, 6. పన్నాలాల్ పిత్తి.
- సైనిక నియమాల ప్రకారం 1948 సెప్టెంబర్ 18 నుంచి హైదరాబాద్ పాలనా బాధ్యతలు మేజర్ జనరల్ జేఎన్ చౌదరి స్వీకరించారు.
- 1948 సెప్టెంబర్ 18న నిజాం రాజ్య ప్రధాన మంత్రి లాయక్ అలీని గృహ నిర్బంధంలో ఉంచారు.
- 1948 సెప్టెంబర్ 18న హైదరాబాద్ సంస్థానానికి వచ్చిన సర్ధార్ వల్లభాయ్ పటేల్కు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బేగంపేట విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు.