
జీడిమెట్ల, వెలుగు: ప్రజలు తాకట్టు పెట్టిన బంగారం, నగల తయారీ కోసం ఇచ్చిన డబ్బుతో ఓ వ్యాపారి ఉడాయించాడు. రాజస్థాన్కు చెందిన ఓం ప్రకాశ్సిర్వీ 15 ఏండ్ల కింద వలస వచ్చి గాజులరామారం డివిజన్చంద్రగిరినగర్లో నివాసం ఉంటున్నాడు. తొలుత ‘రామ్దేశ్’ పేరుతో స్థానికంగా జ్యువెలరీ పెట్టి, ఇటీవల దుకాణం పేరును ‘శ్రీశివం’గా మార్చాడు. చాలా కాలంగా దుకాణం ఉండడంతో అతని వద్ద కొందరు బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు.
మరికొందరు ఆభరణాలు చేయించేందుకు డబ్బులు ఇచ్చారు. ఈ క్రమంలో జనవరి 25 నుంచి దుకాణం మూసివేసి ఉండడం, అతని ఫోన్పనిచేయకపోవడంతో బాధితులు జగద్గిరిగుట్ట పీఎస్ లో బుధవారం ఫిర్యాదు చేశారు. సుమారు రూ.కోటి వరకూ మోసపోయామని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.