మంత్రి కొండా సురేఖ ఫొటోలు మార్ఫింగ్ కేసు ఇద్దరు అరెస్ట్‌

మంత్రి కొండా సురేఖ ఫొటోలు మార్ఫింగ్ కేసు ఇద్దరు అరెస్ట్‌

తెలంగాణ మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫొటోల మార్ఫింగ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోనాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న, జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన వ్యాపారి మహేశ్‌‌లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో కొండా సురేఖ మెడలో రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా ఓ చేనేత కండువా వేశారు. ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసిన నిందితులు అసభ్యకరరీతిలో సోషల్ మీడియా వేదికగా  పోస్ట్ చేశారు. ఈ ఘటనపై మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ALSO READ | దక్కని ఊరట.. క్యాట్ నిర్ణయంపై హైకోర్టుకు ఐఏఎస్‎లు..!