మియాపూర్​లో ఆన్​లైన్​ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

మియాపూర్​లో ఆన్​లైన్​ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
  • రూ.20.60 లక్షలు ఫ్రీజ్, రూ.53 వేల క్యాష్​ సీజ్

మియాపూర్, వెలుగు: మియాపూర్​లో ​క్రికెట్ ​బెట్టింగ్ ​నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ ​చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. హఫీజ్​పేట డివిజన్ మార్తాండనగర్ లోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి బెంగళూరు వర్సెస్​ చెన్నై మ్యాచ్​పై భారీ మొత్తంలో బెట్టింగ్​ నిర్వహిస్తున్నట్లు మాదాపూర్​ జోన్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. 

ఆ ఇంటిపై రైడ్​ చేసి మియాపూర్​కు చెందిన భార్యాభర్తలు అజయ్(46), సంధ్య(40), వ్యాపారస్తులు జీత్​శర్మ(30), సుమంత్(28), గణేశ్​కుమార్(31)ను అరెస్ట్​ చేశారు. ప్రధాన నిందితులు రాజస్థాన్​కు చెందిన సురేశ్(46), కారా(25) పరారీలో ఉన్నారు. రూ.53 వేల క్యాష్​, ఐదు సెల్​ఫోన్లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి బ్యాంక్​ అకౌంట్లలోని రూ.20.60 లక్షలను ఫ్రీజ్​ చేశారు.