లాభాల పేర రూ. 90 కోట్లు వసూలు చేసిన వ్యక్తి అరెస్ట్​

లాభాల పేర  రూ. 90 కోట్లు వసూలు చేసిన వ్యక్తి అరెస్ట్​

కల్వకుర్తి, వెలుగు : డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే రెండు, మూడు రెట్లు  లాభాలు వస్తాయని ఆశ చూపి ప్రజల నుంచి రూ. 90 కోట్లు వసూల్​ చేసిన వ్యక్తిని అరెస్ట్​ చేసినట్టు కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణానికి చెందిన ముజమ్మిల్  స్థానికంగా మసీదులకు ప్రార్థన కోసం వస్తూ చాలా మందిని పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో 20 మందిని ఏజెంట్లను  పెట్టుకొని, లాభాల పేరుతో వసూళ్లకు పాల్పడ్డాడు.

  వీటిని తీసుకెళ్లి వివిధ వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేశాడు. తద్వారా వచ్చిన లాభాలతో రూ. 50 కోట్లను  ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చాడు.   ఈ క్రమంలో తాను పెట్టుబడి పెట్టిన ఒక సంస్థ యజమాని మరణించడంతో రూ. 14 కోట్లు లాస్ అయ్యాడు. దీంతో ఇన్వెస్టర్లకు డబ్బులు ఇవ్వలేకపోవడంతో  కల్వకుర్తి నుండి వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదు తో పోలీసులు అతన్ని అరెస్ట్​ చేశారు.  ఈ సమావేవంలో  సీఐ నాగార్జున ఎస్సై మాధవరెడ్డి తదితరులు ఉన్నారు.