బీరు సీసాలతో వ్యక్తిపై దాడి.. ముగ్గురి అరెస్ట్

బీరు సీసాలతో వ్యక్తిపై దాడి.. ముగ్గురి అరెస్ట్

బెల్లంపల్లి, వెలుగు: బీరు సీసాలతో ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో నిందితులైన ముగ్గురిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలోద్దిన్ టూ టౌన్ ఎస్సై కె.మహేందర్​తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 7న టూ టౌన్ పరిధిలోని కాల్‌టెక్స్​లో ఉన్న ఎస్‌ఆర్‌ఆర్ బార్ అండ్ రెస్టారెంట్‌లో తాండూర్‌కు చెందిన బండారి వంశీపై ముగ్గురు వ్యక్తులు బీరు సీసాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

దర్యాప్తు చేపట్టిన పోలీసులు బార్​లో  సీసీ కెమెరాల రికార్డును పరిశీలించి దాడికి పాల్పడ్డ బెల్లంపల్లిలోని గాంధీనగర్‌కు చెందిన అల్లి సాగర్, బట్వాన్‌ పల్లి గ్రామానికి చెందిన రత్నం సోమయ్య, మంచిర్యాలలోని ఇస్లాంపూర్‌కు చెందిన మామిడి అన్నమయ్యను అరెస్ట్​ చేసినట్లు సీఐ వెల్లడించారు. వీరిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.