మందమర్రిలో 365 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

మందమర్రిలో 365 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
  • ముగ్గురిని అరెస్ట్​ చేసిన మందమర్రి పోలీసులు

కోల్​బెల్ట్, వెలుగు:  మంచిర్యాల జిల్లా మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేసి, రూ.9.12 లక్షల విలువైన 365 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మందమర్రి పోలీస్​స్టేషన్ లో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్​రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. నిర్మల్​ జిల్లా భైంసా పట్టణానికి చెందిన అబ్దుల్​రజాక్  కొద్ది రోజులుగా గుజరాత్​ నుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకువచ్చి మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులకు అమ్ముతున్నాడు. 

రజాక్​ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, తిరుపతి, బొలిశెట్టి జనార్ధన్​కు నకిలీ విత్తనాలు అమ్మినట్లు ఒప్పుకున్నాడు. కాసీపేట మండలం దేవాపూర్​ చింతగూడ గ్రామ శివారులోని సల్పలవాగు పరిపరాల్లో దాచిపెట్టిన 315 కిలోల నకిలీ విత్తనాలను, అందుకు ఉపయోగించిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు పంపించినట్లు ఏసీపీ తెలిపారు. నకిలీ విత్తనాలను రైతులు కొనుగోలు చేయవద్దని సూచించారు.