కస్టమర్స్​గా వచ్చి నగలు దోచారు .. మహిళా దొంగల ముఠా అరెస్ట్​

కస్టమర్స్​గా వచ్చి నగలు దోచారు .. మహిళా దొంగల ముఠా అరెస్ట్​

హైదరాబాద్:  సిటీలో  పలు గోల్డ్​ షాపుల్లో నగలు మాయం చేసిన  మహిళా దొంగల  ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు.   కస్టమర్స్​ లావచ్చి  షాపుల్లో నగలను దోచుకెళ్తున్నారు.  గోల్డ్​ షాపుల్లో నగలు మాయవుతున్నట్లుగా కంప్లైట్స్​ రావటంతో  మేడ్చల్​ జిల్లా జగద్గిరిగుట్ట  ఏసీపీ హనుమంతు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 

 ఈ కేసులో నలుగురు మహిళాల ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు.  ప్రధాన నిందితురాలు పరారీలో ఉందని ఏసీపీ హనుమంతు మీడియాకు వివరించారు.   నిందితులు ఖమ్మం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.