డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన ఇద్దరు డీజేలు

డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన ఇద్దరు డీజేలు
  • 15.13 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్​ పోలీసులు

పంజాగుట్ట,వెలుగు:  బెంగళూరు నుంచి  డ్రగ్స్​తెచ్చి సిటీలో అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను స్టేట్ ​టాస్క్​ ఫోర్స్​ టీమ్​ అరెస్ట్​ చేసింది. అమీర్​ పేట్​ఎక్సైజ్​ పోలీసులు తెలిపిన ప్రకారం.. బంజారాహిల్స్​లో ఎండీఎంఏ డ్రగ్స్​అమ్ముతున్నారనే సమాచారంతో శుక్రవారం రాత్రి టాస్క్​ఫోర్స్​ టీమ్ ​దాడి చేసింది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని 2.65 గ్రాములు ఎండీఎంఏ స్వాధీనం చేసుకుంది. 

అతడు ఇచ్చిన సమాచారంతో ఆదిబట్లలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. వారి వద్ద 12.48 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్​ తో పాటు 326 గ్రాముల ఎండిన గంజాయిని  స్వాధీనం చేసుకుని అమీర్​పేట్​ఎక్సైజ్​ పోలీసులకు అప్పగించారు. డ్రగ్స్​ సరఫరా చేస్తున్నవారు  పలు పబ్బుల్లో డీజేలుగా పని చేస్తున్న అఖిల్, సన్నీగా గుర్తించారు. దాడుల్లో ఎస్టీఎఫ్​ సూపరిండెండెంట్​ ప్రదీప్​రావు, ఇన్​స్పెక్టర్​ భిక్షారెడ్డి, సబ్​ఇన్​స్పెక్టర్​ బాలరాజు పాల్గొన్నట్టు అమీర్​పేట్​ఎక్సైజ్​ ఇన్​స్పెక్టర్ ​ పటేల్​ బానోత్​ తెలిపారు.