
- పెట్టుబడి పేరుతో వీ వన్ ఇన్ ఫ్రా గ్రూప్స్ 12 కోట్లు ఫ్రాడ్
- స్కీముల పేరుతో 90 మంది నుంచి డబ్బులు వసూలు
- బాధితుల ఫిర్యాదుతో ఇద్దరు డైరెక్టర్లు అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు: తమ స్కీముల్లో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో రిటర్న్స్ఇస్తామని 90 మంది నుంచి రూ.12 కోట్లు వసూలు చేసిన ‘వీ వన్ ఇన్ఫ్రా గ్రూప్స్కంపెనీ మూడు నెలల పాటు రిటర్న్స్ఇచ్చి బోర్డు తిప్పేసింది. బాధితుల ఫిర్యాదుతో కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లను సైబరాబాద్ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఏపీలోని వెస్ట్గోదావరి జిల్లాకు చెందిన సురేశ్(చైర్మన్)..‘వీ వన్ఇన్ఫ్రా గ్రూప్స్’ పేరిట కూకట్ పల్లి జేఎన్టీయూ దగ్గర ఉన్న సర్దార్పటేల్నగర్లో కంపెనీ ప్రారంభించాడు.
ఇందులో బాపట్లకు చెందిన వంశీకృష్ణ, ఈస్ట్గోదావరి జిల్లాకు చెందిన వెంకటేశ్డైరెక్టర్లుగా ఉన్నారు. తమ కంపెనీ మొదలుపెట్టిన రెండు స్కీములలో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో రిటర్న్స్ ఇస్తామని ప్రచారం చేశారు. మొదటి స్కీమ్లో 5 లక్షలు పెట్టుబడి పెడితే 25 నెలల పాటు ప్రతి నెల 20,000 చెల్లిస్తామని, 25 నెలల ముగిసిన తర్వాత పెట్టుబడి పెట్టిన 5 లక్షలు కూడా చెల్లిస్తామని ప్రకటించారు. నమ్మకం కోసం గుంట వ్యవసాయ భూమిని రిజిస్ర్టేషన్ చేస్తామని, గ్యారెంటీ కోసం చెక్కులు కూడా ఇస్తామని తెలిపారు. రెండవ స్కీమ్లో రూ. లక్ష పెట్టుబడి పెడితే 36 నెలల పాటు 6000 చొప్పున చెల్లిస్తామని, స్కీము ముగిసిన తర్వాత లక్షలు తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు.
3 నెలలు రిటర్న్స్ఇచ్చి మూసేశారు..
ఈ స్కీముల గురించి తెలుసుకున్న పటాన్చెరుకు చెందిన ముత్యాల గోపాల్మొదటి స్కీములో రూ.6 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీంతో గోపాల్కు కంపెనీ నుంచి మూడు నెలల పాటు నెలకు రూ.20,000 చెల్లించారు. సదాశివపేటలో ఒక గుంట భూమిని కూడా రిజిస్ట్రేషన్చేసినట్లు పత్రాలు కూడా ఇచ్చారు. మూడు నెలల నుంచి రిటర్న్స్ ఇవ్వకపోవడంతో కంపెనీ ప్రతినిధులను ఆశ్రయించాడు. ఎన్నీ సార్లు కాల్కంపెనీ నుంచి స్పందన లేకపోవడంతో ఆఫీసుకు వెళ్లాడు.
అది మూసి ఉండటంతో మోసపోయినట్లు గుర్తించిన గోపాల్.. సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోపాల్తో పాటు మరో 25 మంది బాధితులు కూడా పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు వెంకటేశ్, వంశీకృష్ణలను బుధవారం అరెస్ట్ చేశారు.
ఈ కేసులో కంపెనీ చైర్మన్ సురేశ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇలా ముగ్గురు కలిసి రెండు స్కీముల పేరుతో 90 మంది బాధితుల నుంచి రూ. 12 కోట్లు వసూళు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడి కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.