
కామారెడ్డి, వెలుగు: రైస్ మిల్లు ఓనర్ పై కేసు నమోదైన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. జుక్కల్ మండలం వజ్రకండి శివారులోని పరమేశ్వర రైస్ మిల్లులో మంగళవారం సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండేండ్లుగా సీఎంఆర్ రికార్డులు పరిశీలించారు. 21,583 క్వింటాళ్ల వడ్లు తేడా వచ్చినట్టు గుర్తించారు. అధికారుల ఫిర్యాదుతో పరమేశ్వర మిల్లు ఓనర్ పై కేసు నమోదు చేసినట్లు జుక్కల్ఎస్ఐ భువనేశ్వర్తెలిపారు.