తూప్రాన్ లో పీడీఎస్​ బియ్యం పట్టివేత

తూప్రాన్ లో పీడీఎస్​ బియ్యం పట్టివేత

తూప్రాన్ , వెలుగు: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సోమవారం ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్  నుంచి మెదక్ జిల్లా నార్సింగ్ కు లారీలో పీడీఎస్​బియ్యాన్ని తరలిస్తున్న విషయం తెలియడంతో పౌర సరఫరా అధికారులకు సమాచారం చేరవేశామన్నారు.

తూప్రాన్ శివారులో ఉన్న టోల్​గేట్​ వద్ద డీటీ సాధిక్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టగా లారీ లో 220 క్వింటాళ్ల పీడీఎస్ ​బియ్యాన్ని గుర్తించామన్నారు. అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పట్టుకున్న బియ్యాన్ని తూప్రాన్ లోని పౌరసరఫరాల గోదాంకు తరలించామని ఎస్​ఐ తెలిపారు