హుస్నాబాద్​లో కార్డన్​సెర్చ్ .. 15 బైకులు, 5 ఆటోలు సీజ్​

హుస్నాబాద్​లో కార్డన్​సెర్చ్ .. 15 బైకులు, 5 ఆటోలు  సీజ్​

హుస్నాబాద్​, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో పోలీసులు కార్డన్​సెర్చ్​ నిర్వహించారు. బుధవారం రాత్రి పట్టణంలోని నాగారంరోడ్డులో డబుల్​బెడ్​రూంకాలనీలో హుస్నాబాద్​ ఏసీపీ సతీశ్​ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటికీ తిరుగుతూ తనిఖీలు చేశారు. ఇండ్లలో నివసిస్తున్న వారి వివరాలను సేకరించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు, నేరస్తులు వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అని ఆరా తీశారు. అనుమానితులను ప్రశ్నిస్తూ, వారి వివరాలను నమోదు చేసుకున్నారు. కార్డన్​సెర్చ్​లో ఎలాంటి ధ్రువపత్రాలు లేని 15 బైకులు, 5 ఆటోలను సీజ్​ చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. 

ప్రజల రక్షణతోపాటు వారిలో సెక్యూరిటీ పట్ల అవగాహన కలిగించడం కోసం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్టు ఏసీపీ సతీశ్​ తెలిపారు. సైబర్ నేరం జరిగితే ఎన్​సీఆర్​పీ పోర్టల్ www.cybercrime.gov.in <http://www.cybercrime.gov.in> లో ఫిర్యాదు చేయాలన్నారు. టోల్ ఫ్రీ నంబర్లు 1930, 100కు కూడా  కాల్ చేయొచ్చన్నారు.హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేశ్​, అక్కన్నపేట, కోహెడ ఎస్సైలు విజయభాస్కర్​, అభిలాష్, సర్కిల్ పోలీసు,  డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.