కొరకట్​పాడులో కార్డెన్​ ​సెర్చ్

కొరకట్​పాడులో కార్డెన్​ ​సెర్చ్

భద్రాచలం, వెలుగు :  చర్ల మండలంలోని ఛత్తీస్​గఢ్​ బార్డర్​లో ఉన్న మావోయిస్టు ప్రభావిత గ్రామం కొరకట్​పాడులో శుక్రవారం పోలీసులు కార్డెన్​ సెర్చ్ నిర్వహించారు. ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గ్రామస్తులతో సమావేశమై అక్కడ నివసించే 40 కుటుంబాలకు దోమతెరలను పంపిణీ చేశారు. 

ఎస్పీ రోహిత్​రాజ్​ ఆదేశాల మేరకు కార్డెన్​ సెర్చ్​ నిర్వహించామని చర్ల సీఐ రాజువర్మ తెలిపారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరించొద్దని సూచించారు. ఎస్సై నర్సిరెడ్డి, సీఆర్​పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.

ఆళ్లపల్లి : మండల పరిధిలోని ముత్తాపురంలో ఎస్సై రతీశ్​కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అక్కడ నివసించే 11 కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వారికి ఎలాంటి సహాయం అందించవద్దని, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.